*ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ జన్మదినం సందర్భంగా…*
*తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం…*
*షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి రక్తదాతకు హెల్మెట్..
ప్రజాగొంతుక వెబ్ న్యూస్ కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాలు మహమ్మద్ అలీ షబ్బీర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 15 వ తేదీ శనివారం రోజున ఉదయం 9 గంటల నుండి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ బాలు మాట్లాడుతూ మహమ్మద్ అలీ షబ్బీర్ గారు తన జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తాన్ని అందించాలనే మహోన్నతమైన సంకల్పంతో 2023లో 186 యూనిట్లను, 2024లో 336 యూనిట్ల ను అందించడం జరిగిందని,ఈ సంవత్సరం 500 ల యూనిట్ల రక్తాన్ని సేకరించడం కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని అన్నారు,రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు హెల్మెట్ ను,ప్రశంస పత్రాన్ని అందజేయడం జరుగుతుందని రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలను 9492874006 కు సంప్రదించాలని అన్నారు.
రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను,రక్తదానానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ మరియు పీజీ కళాశాల,స్పూర్తి డిగ్రీ కళాశాల, తెలంగాణ గిరిజన బాలుర డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్,ఉపాధ్యక్షులు గంప ప్రసాద్,సభ్యులు అంజల్ రెడ్డి లు పాల్గొనడం జరిగింది.