సుమారు 50 లక్షల విలువగల గంజాయి పట్టివేత.
ప్రజా గొంతుక న్యూస్/రామగుండం
రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం లో గురువారం రోజున నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ కేసు వివరాలను వెల్లడించారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి లోని పెద్దపల్లి జోన్ లో గల గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సి పి రామగుండము శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీసీపీ పెద్దపల్లి చేతన ఆద్వర్యం లో ఏసీపీ గోదావరిఖని ఎం. రమేష్ పర్యవేక్షణ లో గుట్టు గా తరలిస్తున్న గంజాయి ముఠాను బుదవారం రోజున గోదావరిఖని టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11ఎ మైన్ క్రాస్ వద్ద వాహనాల తనిఖి చేస్తుండగా 2 కార్లలో తరలిస్తున్న 96.770 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని ,2 వాహనాలు సీజ్ చేసి, ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు.
పట్టుబడిన నిందితుల వివరాలు:-
A1: ఉదయ్ వీర్( 32) దాడ్కి, సయ్యమ్, ఆగ్రా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం,
A2: రాజ్ లోథి సంజు( 35) ఎదల్పూర్, ధోల్పూర్, రేజస్థాన్ రాష్ట్రం.
A3: కేశవ్ ఖరా (25)సంవ బీజాపూర్, ఖుర్జీ, నందేపూర్, సెమల, కోరుపుత్, ఒడిస్సా రాష్ట్రం, (బొలెరో నియో కారు యజమాని)
A5: సోమంత ఖోరా (50) సెమలే, బీజాపూర్, రోరాపుట్, సిమ్లా, ఒడ్లిస్సా రాష్ట్రం.
పరారిలో ఉన్న నిందితులు.
A4. సూరజ్ (వెర్నాకారు యజమాని)
A6: అర్జున్ భోరి, జగదల్పూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, (సరఫరాదారు).
స్వాధీనం చేసుకొన్నా వాటి వివరాలు..
👉96.770 కిలోల గంజాయి
👉2 కార్లు
👉6 సెల్ ఫోన్లు
*వివరాల్లోకి వెళ్తే..*
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ లో గల గోదావరిఖని టూ టౌన్ పోలీసులు వాహనాలు తనిఖి చేస్తుండగా 11ఎ మైన్ మీదుగా మహారాష్ట్ర కు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు11ఎ మైన్ స్టేజీవద్ద వాహనాల తనిఖీ నిర్వహించగా,
96.770 కిలోల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకొని విచారించగా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉదయ్ వీర్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కేశవ్ ఖర, సోమనాథ్ ఖర, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజులోథి సంజు అను వారు ఓక ముఠాగా ఏర్పడి గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. చత్తీస్గడ్ రాష్ట్రంలోనీ జగదల్పూర్ నుండి మంథని మీదుగా మహరాష్ట్ర కు తరలిస్తున్న క్రమంలో పక్కాసమాచారం మేరకు పోలీస్ వారు 11ఎ మైన్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీలో పట్టుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన 96.770 కిలోల గంజాయి విలువ రు. 48,38,000. ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా
సీపీ మాట్లాడుతూ, గంజాయి రహిత కమీషనరేట్ గా మార్చడానికి రామగుండం కమీషనరేట్ పోలీస్ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ, అవగాహన కల్పించడం జరుగుతుందని, కమీషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు, నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుదన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ,గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్నవారిపై నిఘా ఉంచి గంజాయి కిట్ల సహాయంతో యూరిన్ టెస్ట్ లు నిర్వహించి గంజాయి సేవించే వారిని వారికి గంజాయి అందించే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఎక్కడైనా గంజాయిని పండించినా/ అమ్మినా అక్రమంగా రవాణా చేస్తున్నా తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసారు. యువకులు గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసై తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకోవడంతో పాటుగా తమ కుటుంబాలను మొత్తం ఇబ్బందులలోకి నేట్టేస్తున్నారని అంతేకాక గంజాయి మత్తులో మరియు డబ్బుల కోసం నేరాలు చేయడానికి సైతం వెనకాడరని తెలిపారు. ఇలా జరగకుండా ఉండాలంటే గంజాయి అనే మహమ్మారిని మనం అందరం కలిసి అంతం చేయాలని గంజాయి రహిత కమీషనరేట్ నిర్మాణం లో అందరు భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
ఈ ముఠా ను పట్టుకోవడం లో చాకచక్యం గావ్యవహరించి న స్పెషల్ బ్రాంచ్ రామగుండం, టాస్క్ ఫోర్స్ రామగుండం, గోదావరిఖని టూ టౌన్ పోలీసు సిబ్బందినీ పోలీస్ కమీషనర్ అబినందించారు.