కరీంనగర్ జిల్లాలో సంగీత వాయిద్య పరికరాలను అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ప్రజా గొంతుక న్యూస్/కరీంనగర్/రిపోర్టర్ నూక రాందాసు
అంధులైన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంగీత వాయిద్య పరికరాలను అందించారు. కరీంనగర్ జిల్లాలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు జిల్లా యంత్రాంగం సంగీతంలో శిక్షణ అందించారు.
అంధ విద్యార్థులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని కలుసుకోగా, ఈ సందర్భంగా సంగీత వాయిద్య పరికరాలను అందించారు. విద్యార్థులు పాడిన పాటల సీడీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విద్యార్థులు ముఖ్యమంత్రి ఎదుట పాట పాడి వినిపించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి , కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి , ఇతర అధికారులు పాల్గొన్నారు.