తొమ్మిదిరేకుల మాజీ ఎంపీటీసీ నాగిళ్ళ యాదయ్యకి మాతృ వియోగం
పరామర్శించిన బీఆర్ఎస్ యువనాయకులు వై. రవీందర్ యాదవ్
ప్రజా గొంతుక/రంగారెడ్డి జిల్లా బ్యూరో (రాజమోని. రవీందర్ గౌడ్)
షాద్ నగర్ నియోజకవర్గం, కేశంపేట మండలం, తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నాగిళ్ళ యాదయ్య మాతృమూర్తి లక్ష్మమ్మ అనారోగ్యంతో బుధవారం సాయంత్రం,కన్నుమూశారు.విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ యువనాయకులు వై. రవీందర్ యాదవ్ వారి స్వగృహానికి వెళ్లి, పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు ఆయన వెంట ఉండి పరామర్శించారు.