రైతులు ఆ ధైర్య పడవద్దు….
రెండు రోజులలో బొమ్మకూరు నుండి తపస్పల్లి డ్యాం కు నీళ్లు తరలింపు….
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనగుల శ్వేతా వెంకన్న..
ప్రజా గొంతుక డెస్క్
బచ్చన్నపేట మండలంలో పలు గ్రామాల చెరువులలో నీళ్లు లేక పంట పొలాలు ఎండుతున్నాయని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి తెలియజేయడంతో వారు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి తో మాట్లాడి దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ నియోజకవర్గం ప్రాంతానికి నీళ్లు అందించడానికి బొమ్మకూరు డ్యామ్ కు నీటిని పంపింగ్ చేస్తున్నారు. బొమ్మకూరు నుండి రెండు రోజులలో తపాస్పల్లి డ్యాంకు పంపింగ్ చేస్తామని నీటిపారుదల శాఖ ఈ ఈ, ఏఈలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న మాట్లాడుతూ జనగామ అభివృద్ధి ప్రదాత డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు మంత్రులతో మాట్లాడి నీటిని తపస్పల్లి డ్యామ్ కు పంపింగ్ చేయాలని కోరారని ,రెండు రోజులలో పంపింగ్ మొదలవుతుందని తెలియజేశారు. ప్రతిపక్షాల మాటలు విని రైతులు ఎవరు ఆ ధైర్య పడవద్దు అని అన్నారు.